పేద విద్యార్థులకు బొబ్బ ట్రస్ట్ నోట్ బుక్స్ పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: విద్య ద్వారానే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు సాధ్యపడుతుందని బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ వేమన డబ్ల్యుఎస్ సీ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులకు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నోట్ బుక్స్, పెన్సిల్స్, పెన్నులు, రబ్బర్లు, షార్ప్ నర్లు, స్కేళ్ళు, అంగన్ వాడీ విద్యార్థులకు పలకలు, నోట్ బుక్స్ తదితర వస్తువులను చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవత రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్య పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ఆసరాగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చందర్ రావు, షైఫుల్లహ ఖాన్, గౌస్, పోచయ్య, అనంత రెడ్డి, శోభ దూబే, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

వేమన‌కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేస్తున్న బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ నవత రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here