సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం – మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: హాఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హఫీజ్ పెట్ వార్డు కార్యాలయంలో ఎలక్ట్రికల్ శాఖ అధికారులతో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత నెలలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా హాఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ పరిధిల్లోని పలు కాలనీలలో పర్యటించి అభివృద్ధి పనులపై పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రెండు డివిజన్లలో నూతనంగా మంజూరైన విద్యుత్ దీపాలు, స్తంబాలను త్వరగా ఏర్పాటు చేయాల‌ని అధికారులకు సూచించారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డీఈ సునీల్, ఏఈ రామ్మోహన్, నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, నాగేశ్వర్ రావు, షరీఫ్, షేక్ సాబేర్, లైన్ మెన్లు శివశంకర్ రెడ్డి, ప్రేమ, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడుతున్న మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here