నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ లో విద్యుత్ ప్రమాదానికి గురై ఇంట్లోని వస్తువులన్నీ దగ్దమైన నిరుపేద కుటుంబానికి బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అర్థిక సహాయాన్ని, నిత్యావసర సరుకులను అందజేశారు. సోమవారం రాత్రి కురిసిన వర్షంతో విద్యుత్ అగాధానికి గురై ఇంట్లో ఉన్న వస్తువులు కాలిపోవడంతో పేద కుటుంబం రోడ్డు పాలైంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న పేద కుటుంబానికి మానవతా దృక్పథంతో బీజేపీ రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ మంగళవారం కుటుంబాన్ని పరామర్శించారు. పేద కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సహాయం అందజేశారు. పేద కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. స్థానిక రెవెన్యూ ఆఫీసర్ తో ఫోన్లో మాట్లాడి వారికి నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానిక తహశీల్దార్ ను కోరారు. ఆపదలో ఆదుకున్న రవికుమార్ యాదవ్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీధర్, శ్రీనివాస్ యాదవ్, మహేష్ యాదవ్, ప్రసాద్, బాపురెడ్డి, శ్రీశైలం యాదవ్, జితేందర్, లక్ష్మణ్ ముదిరాజ్ పాల్గొన్నారు.
