నమస్తే శేరిలింగంపల్లి: పరిసరాల పరిశుభ్రతతో పాటు తడి, పొడి చెత్తను వేరు చేసి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ప్రజలందరూ సహకరించాలని చందానగర్ సర్కిల్ వైద్యాధికారి కార్తిక్ ఆయా కాలనీ అసోసియేషన్ సభ్యులకు, ప్రజలకు సూచించారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ వారోత్సవాల్లో భాగంగా కేంద్ర స్వచ్ఛ సర్వేక్షన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు చందానగర్ సర్కిల్ లో ఆజాది కా అమృత్ మహోత్సవ్ – సబ్ కా ప్రయాస్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని జేపీఎన్ నగర్, ఎస్ ఎం ఆర్ వినయ్ సిటీల్లో స్వచ్ఛత, పరిశుభ్రత కోసం సహకరించిన కాలనీ అసోసియేషన్ సభ్యులను మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి కార్తీక్ మాట్లాడుతూ పారిశుద్ధ్య సిబ్బందికి స్వచ్ఛత కోసం తడి, పొడి చెత్తను వేరు చేస్తూ స్వచ్ఛ ఆటోకు అందించడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా, మలమూత్ర విసర్జన చేయకుండా ఆయా కాలనీ వాసులు తీసుకున్న చర్యలు అభినందనీయమని అన్నారు. కాలనీలలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య అధికారులు ప్రసాద్, రాజు, నాగరాజు గౌడ్, జెపి నగర్ అసోసియేషన్ అన్నిరాజు, రాఘవరావు, రామాంజనేయులు, అశోక్, ఎస్ ఎం ఆర్ వినయ్ సిటీ కాలనీ సభ్యులు జాన్సన్, ప్రసాద్ గోరంట్ల, సురేష్, హిమబిందు, కుసుం కుమార్ సభ్యులు పాల్గొన్నారు.