మస్తాన్‌నగర్‌లో బీజేపీ నాయకుల పర్యటన

కొండాపూర్‌ (నమస్తే శేరిలింగంపల్లి):  కొండాపూర్‌ డివిజన్‌ పరిధిలోని మస్తాన్‌నగర్‌లో ఆదివారం డివిజన్‌ బీజేపీ ఇన్‌చార్జి బాల్ద అశోక్‌ ఆధ్వర్యంలో నాయకులు పాదయాత్ర నిర్వహించారు. స్థానికంగా ఉన్న సమస్యలను వారు పరిశీలించారు. ప్రధానంగా రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్య సమస్యలు ఉన్నాయని గుర్తించారు.

మస్తాన్ నగర్‌లో పర్యటిస్తున్న బీజేపీ నాయకులు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం ఇన్ని ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాసకు ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ బీజేపీ అధ్యక్షుడు నీలం జయరాములు, నాయకులు ఆత్మారాం, మన్నెం కొండ సాగర్, శ్రీకాంత్ గౌడ్, రాము, వెంకట్ నాయక్, కిషన్ రామ్ సుతార్, శ్యాంరాథోడ్, వినోద్ సర్వి, బాలాజీ, బస్తీవాసి నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

గుంతలతో అధ్వాన్నంగా దర్శనమిస్తున్న రహదారిని పరిశీలిస్తున్న బీజేపీ నాయకులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here