శేరిలింగంపల్లి, మే 21 (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్ సోదరుడి సతీమణి చాలా రోజుల నుండి అనారోగ్యంతో బాధపడటం తెలుసుకొని ఆయన స్వగృహంలో ఆయనను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు యాదవ్, కేవీఎస్ఎన్ రాజు, గోవర్ధన్ గౌడ్, నీరటి చంద్రమోహన్, జక్కలి రాజు యాదవ్ పరామర్శించారు.