శేరిలింగంపల్లి, మే 21 (నమస్తే శేరిలింగంపల్లి): 40 సంవత్సరాల వయసులో భారతదేశపు అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ యువతకు రాజకీయాల్లో మార్గదర్శకుడిగా నిలిచారని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హాఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని గంగారం హుడా కేఫ్ లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎంబిసి డెవలప్మెంట్ చైర్మన్ జేరిపేటి జైపాల్, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి జగదీశ్వర్ గౌడ్ నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేసే వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించడం, పంచాయతీ రాజ్ను బలోపేతం చేయడం, టెలికాం, ఐటీ విప్లవం, కంప్యూటరైజేషన్ కార్యక్రమాలు, శాంతి ఒప్పందాల కొనసాగింపు, మహిళా సాధికారత, సార్వత్రిక రోగనిరోధక కార్యక్రమం, సమ్మిళిత విద్యపై ప్రాధాన్యతతో కొత్త విద్యా విధానం వంటి అనేక ముఖ్యమైన కార్యక్రమాలను దేశంలో పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చారని, ఈ ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కో ఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, టీపీసీసీ లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి, సీనియర్ నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, వీరేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ అలీ, బాష్పక యాదగిరి, మారేలా శ్రీనివాస్, జహంగీర్, నగేష్ నాయక్, కట్ల శేఖర్ రెడ్డి, ఉరిటీ వెంకట్ రావు, ఆయాజ్ ఖాన్, శేఖర్ ముదిరాజ్, నరేందర్ గౌడ్, సౌందర్య రాజన్, విజయ్ భాస్కర్ రెడ్డి, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.