ఈటల రాజేందర్ కు మద్దతుగా ఇంటింటా ప్రచారం

నమస్తే శేరిలింగంపల్లి:హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా వీణవంక మండలం, శ్రీరాములపేట వార్డ్ బస్తీల్లో, తదితర ప్రాంతాల్లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ సోమవారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివరిస్తూ కమ‌లం గుర్తుకు ఓటెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు. మహిళ మోర్చా నాయకులతో ఇంటింటికి బొట్టు పెట్టి ఎన్నిక ప్రచారం నిర్వహించారు. బిజెపిఅభ్యర్థి ఈటల రాజేందర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు, గ్రామసర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఈటలకు మద్దతుగా శ్రీరాములపేటలో ఇంటింటా ప్రచారం చేస్తున్న జ్ఞానేంద్ర ప్రసాద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here