నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గా పదవీ ప్రమాణస్వీకారం చేసిన డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కి అఖిల భారత యాదవ మహాసభ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి నడికూడ రఘునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు బాలరాజ్ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దూదిమెట్ల బాల రాజుకు శాలువా కప్పి పూల మాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. యాదవుల అభివృద్ధికి కృషి చేయాలని బాల్ రాజ్ ను కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు సత్యనారాయణ యాదవ్, సిద్ధు యాదవ్, బాలు యాదవ్, రేనుకేశ్ యాదవ్, సంతోష్ యాదవ్, పి.రమేష్ యాదవ్, సాయి కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
