ఆల్ ఇండియా క్రాప్ట్ మేళాలో ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో గురువారం సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. అందులో‌ భాగంగా ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. రేణుక ప్రభాకర్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా మోదమున గణపతికి, ఇందరికి అభయమ్ము, సరస్వతి, అష్టలక్ష్మి స్తోత్రం, కృష్ణ జనన శబ్దం, గరుడ గమన, అన్నమాచార్య కీర్తన అంశాలను మేఘన, రూప రవళి , కౌముది, అంశిత, లాస్య, లోహిత, రీతిక తదితరులు ప్రదర్శించారు. డాక్టర్ హిమబిందు కనోజ్ శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో జయ జయ స్వామిన్, జతిస్వరం, ముద్దుగారేయ్ యశోద, శక్తం అంశాలను మేఘన, ఉజ్వల, శ్రీ రంజని, ఆశ్రిత, సృజన, రక్షా తదితరులు ప్రదర్శించి అందరిని అలరింపజేశారు.

కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here