భవానీపురంలోని సమస్యలను పరిష్కరించాలని వినతి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని భవానీ పురం కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా చూడాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం భవానీపురం కాలనీ వాసులు కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా చూడాలని టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు రఘునాథ్ రెడ్డి భవానీపురం‌ కాలనీలో పర్యటించారు. సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరష్కరించేలా చూస్తామన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో కాలనీ వాసులు రఘునందన్ రెడ్డి, సుందరం, లక్ష్మీకాంత్ రెడ్డి , హేమాద్రి, వై టీ కృష్ణారెడ్డి, ప్రసాద్, పర్వత రెడ్డి, కృష్ణమాచారి, విఠలాచార్య ,ప్రేమ్, కిరణ్ బాబు, రాఘవులు, ప్రసాద్, రాజు, అబ్దుల్లా, భూమన్న, శ్రీనివాస్, జనార్ధన్, రాంరెడ్డి, రామకృష్ణారెడ్డి, రామకృష్ణ, ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రఘునాథ్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న భవానీ పురం కాలనీ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here