స‌మ న్యాయం జ‌రిగేంత వ‌ర‌కు బీసీలు పోరాడాలి: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంపల్లి, జూన్ 15 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): నాంపల్లిలోని తెలుగు విశ్వ‌విద్యాల‌యంలో ఉన్న‌ నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో పి నరహరి పృథ్వీరాజ్ సింగ్ ర‌చించిన ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని ఆవిష్క‌రించారు. రచయిత పుస్తక ఆవిష్కరణ సభలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఎంపీ ఈటెల రాజేంద‌ర్‌, పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్ గౌడ్‌, బీఆర్ఎస్ శ్ర‌వ‌ణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్ మాట్లాడుతూ బీసీ సంఘాలు, బీసీ కులాలు అంద‌రూ ఐక‌మ‌త్యంగా ఉండాల‌ని, పోరాటాలు చేయాల‌ని పిలుపునిచ్చారు. ఉద్య‌మ బాట‌నే మ‌న‌కు ముఖ్య‌మ‌ని అన్నారు. ఐఏఎస్ అధికారి న‌ర‌హ‌రి పృథ్వీ సింగ్ ర‌చించిన పోరుబాట పుస్త‌కం మ‌న‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తుంద‌న్నారు. బీసీల‌కు అన్ని రంగాల్లోనూ స‌మ న్యాయం జ‌రిగేంత వ‌ర‌కు పోరాడాల‌ని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మహేందర్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, వనపర్తి జిల్లా గొర్రెల మేకల సహకార సంఘం అధ్యక్షుడు మధు యాదవ్, మురళీధర్ దేశ్ పాండే, యాదవ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లక్ష్మీ యాదవ్, బెంగళూరు బీసీ నాయకులు లక్ష్మణ్ యాదవ్, బేరి చంద్రశేఖర్ యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here