టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి: కసిరెడ్డి సింధుర‌ఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర 9వ రోజున చందానగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పోరేటర్ కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ లతో పాటు సింధూరఘునాథ్ రెడ్డి పాదయాత్ర చేశారు. సింధూరెడ్డి మాట్లాడుతూ 2023 లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. స్వచ్చందంగా జనం నీరాజనం పడుతూ, యాత్రకు మద్దతు తెలుపుతున్నారని, టిఆర్ఎస్ కు చెక్ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. పాలనాపరంగా విఫలమైన అధికార పార్టీ పాలించే అర్హత కోల్పోయిందని కసిరెడ్డి సింధు అన్నారు. ఈ కార్యక్రమంలో కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, అమిత్ దుబే , శివ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

బండి సంజయ్ పాదయాత్రలో కసిరెడ్డి సింధు రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here