నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ బిజెపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో “భారతరత్న” స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాధకృష్ణయాదవ్ మాట్లాడుతూ భారత రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా అటల్ బిహారి వాజ్ పేయ్ చరిత్రలో నిలిచిపాయారని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్ది ప్రధాన కార్యదర్శులు టి.వి. మదనాచారి, శివ శ్రీనివాస్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్ది, కొండయ్య యాదవ్, గంగాధర్, దీపాల కొండయ్య, డివిజన్ కార్యదర్శి కొండయ్య, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు చంద్రకళ, ప్రధాన కార్యదర్శి భారతి, బాలమ్మ, బీజేవైఎం అధ్యక్షుడు ఆనంద్, శివ యాదవ్, నరేష్ రెడ్డి, నాగరాజు, అభిషేక్, శ్రీధర్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
