నమస్తే శేరిలింగంపల్లి: వేములవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని ప్రభుత్వవిప్ ఆరెకపూడి గాంధీ సందర్శించారు. ఆలయ పాలకమండలి సభ్యులు, అధికారులు గాంధీకి స్వాగతం పలికారు. శ్రావణ మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని రాజరాజేశ్వర స్వామిని దర్శించున్న గాంధీ ప్రత్యేక పూజలు ఆచరించారు. ఆలయ ప్రధానార్చకులు గాంధీని ఆశీర్వదించి స్వామి వారి శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి విశేష కృషి చేస్తోందని అన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు కోనేరు ప్రసాద్ తదితరులు ఉన్నారు.