స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆదిత్య న‌గ‌ర్ వాసుల విన‌తి

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయ‌న‌ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆదిత్య నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ త‌మ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్లను వేయాలని, UGD పనులు చేపట్టాలని, మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపర‌చాలని, వీధి దీపాలను వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే కాలనీలో పర్యటిస్తానని, ఆదిత్య నగర్ కాలనీలో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను, UGD పనుల‌ను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని, అన్ని రోడ్లను దశల వారిగా చేప‌ట్టి పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ సీనియర్ నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆదిత్య నగర్ కాలనీ ప్రెసిడెంట్ మహమ్మద్ ఖాసీం, వైస్ ప్రెసిడెంట్ లియాకత్, సెక్రెటరీ మొయిజ్, బాబు మియా, మహమ్మద్ అమీర్, మహమ్మద్ అష్రాఫ్, మహమ్మద్ ఫజల్, షేక్ అస్లాం, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here