ఘ‌నంగా కొండకల్ శంకర్ గౌడ్ 56వ జయంతి

శేరిలింగంపల్లి, మే 9 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంప‌ల్లి మాజీ ఇన్‌చార్జి కొండకల్ శంకర్ గౌడ్ 56వ జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా స్మారక కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జీహెచ్ఎంసి కార్మికులకు పండ్లు పంపిణీ చేసి గౌరవించారు. తెలంగాణ సాధనలో శంకర్ గౌడ్ త్యాగాలను స్మరించుకున్నారు. మారబోయిన రవి యాదవ్ మాట్లాడుతూ శంకర్ గౌడ్ తెలంగాణ కోసం చేసిన త్యాగాలు మన తరాల వారికి ప్రేరణ అని అన్నారు. శేరిలింగంపల్లి అభివృద్ధికి ఆయ‌న‌ చేసిన కృషిని మరువలేమ‌ని, ఈ రోజు మన కర్తవ్యం ఆయ‌న స్వప్నాలను నిజం చేయడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కే ఎన్ రాములు, కొండగల్ శ్రీనివాస్ గౌడ్, గంగాధర్ గౌడ్, డాక్టర్ రవికుమార్, స్వామినాథ్, ప్రభాకర్ గౌడ్, గడ్డం శ్రీనివాస్, శ్రీకాంత్ యాదవ్, సురేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here