క‌వుల‌కు ఘ‌నంగా స‌న్మానం

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 17 (న‌మస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్ల హుడా కాంప్లెక్స్ లో శేరిలింగంపల్లి సాహితీ, సాంస్కృతిక కళా సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం కవి సమ్మేళనం, కవుల ఇష్టా గోష్టి కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో ప్రజలను అన్ని రంగాల్లోనూ చైతన్యవంతం చేసేందుకు కవులు, కళాకారులు, రచయితలు ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుందన్నారు. సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలను ప్రశ్నించడం, ఉద్యమించటం కవులు, కళాకారుల పోరాట స్ఫూర్తికి నిదర్శనమన్నారు. ఎందరో కవుల స్ఫూర్తితో ప్రపంచం సంస్కరించబడుతూ ముందుకు సాగుతుందని ఆయన వెల్లడించారు.

క‌వుల‌ను స‌న్మానించిన జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

అనంతరం శేరిలింగంపల్లి సాహితీ సాంస్కృతిక కళా సేవా సమితి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ ఆలపాటి సభాద్యక్షులుగా వ్యవహరించగా అధ్యక్షుడు మోటూరి నారాయణరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవీంద్ర బాబు అరవా ఆధ్వర్యంలో కవుల ఇష్టాగోష్టి కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల శాఖ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ వి.డి.రాజగోపాల్, ప్రముఖ పారిశ్రామికవేత్త వినోద్ గౌడ్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ క‌న్వీన‌ర్‌ తాడిబోయిన రామస్వామి యాదవ్, డాక్టర్ గోగు వెంకటేశ్వర్లు, భమిడిపాటి వెంకటేశ్వరరావు, డాక్టర్ దూత రామకోటేశ్వరరావు, సుమ చంద్ర, డి.వి.ఆర్.మూర్తి, సిహెచ్.రంగనాయకమ్మ, కొలచన విజయభారతి, కండే సుప్రియ, సత్యవీణ మొండ్రేటి, మోదేపల్లి శీనమ్మ, ఉషారాణి, కవి మొగలిమాల, గుండ్ల నారాయణ, కందూరు చంద్రప్రకాష్ గుప్తా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కవులను జగదీశ్వర్ గౌడ్ ఘనంగా సత్కరించారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here