ఆడుకుంటూ 3వ అంతస్తు నుంచి కిందపడి 17 నెలల బాలుడు మృతి

  • శేరిలింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్పలో విషాదం

నమస్తే శేరిలింగంపల్లి: మూడవ అంతస్తు నుంచి కిందపడి 17 నెలల బాలుడు మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోల్ కతా కు చెందిన రోజీనా ఖాతూన్, ముషారఫ్ ఖాన్ దంపతులు పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప ప్లాట్ నంబర్ 46 రూమ్ 27లో నివాసం ఉంటున్నారు. ముషరాఫ్ ఖాన్ బట్టల దుకాణం లో సేల్స్ ఎక్జిక్యూ టివ్ గా పనిచేస్తున్నాడు. వీరికి 17 నెలల రిజ్వాన్ ఖాన్ ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఆదివారం ఉదయం 11 గం.ల సమయంలో రీజ్వాన్ ఖాన్ బెడ్రూంలో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో తల్లి రోజీనా ఖాతూన్ బట్టలు ఆరవేసేందుకని మేడ పైకి వెళ్ళింది. ఈ క్రమంలో ఆ బాలుడు ఆడుకుంటూ 3 వ అంతస్తుకు వెళ్ళాడు ఇది తల్లి గమనించలేదు. దీంతో ఆడుకుంటూ 3 వ అంతస్తు పైనుంచి ప్రమాదవశాత్తూ కింద పడ్డాడు. తీవ్ర రక్తస్రావమైన ఆ బాలుడిని దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధృవీకరించారు. చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కన్నీరు మున్నీరవుతున్నారు బాలుడి తల్లి తండ్రులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతి చెందిన బాలుడు రిజ్వాన్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here