యాదాద్రి మ‌హా కుంభ సంప్రోక్ష‌ణ మ‌హోత్స‌వంలో ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: చరిత్రలో నిలిచిపోయేలా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని నిర్మించారని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం లో మహాకుంభ సంప్రోక్షణ, స్వయంబువుల దర్శనం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని వాయువ్య గోపురం పై ప్ర‌త్యేక పూజ‌లు చేసి, ప‌విత్ర జ‌లాల‌తో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో నిలిచేలా ఇక కరువెరగని కాళేశ్వరం, తరాతరాలుగా గుర్తుండిపోయేలా నరసింహుని పుణ్యక్షేత్రం యదాద్రి నిర్మాణం చేసి సువర్ణాక్షరాలతో లిఖింపదగిన మహోన్నతుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. యాదాద్రి ఆలయం సువర్ణ శోభితం, పూర్తిగా కృష్ణ శిలతో, సంప్రదాయ హంగులతో, పసిడి వర్ణపు కాంతులతో మెరిసిపోతూ, భక్తులకు‌ కొంగు బంగారంగా నిలుస్తూ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ దర్శనం ఇవ్వనున్నట్లు చెప్పారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here