ప్రతీ కాలనీలోని సమస్యల‌ను పరిష్కరిస్తా – ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల‌ కల్పనకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీ లో రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేసినందుకు ఆ‌ కాలనీ వాసులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకృష్ణ కాలనీ వాసులు, సాయి నగర్ వాసులు ఆయా‌ కాలనీలలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే‌ గాంధీకి వినతిపత్రం అందజేశారు. గచ్చిబౌలి డివిజన్‌ పరిధిలోని ప్రతి కాలనీని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. శ్రీ కృష్ణ కాలనీలోని స్మశాన వాటిక అభివృద్ధికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంత్రి ప్రగడ సత్యనారాయణ, కాలనీ వాసులు శ్రీకాంత్, కిషోర్, సాయిరాం, లక్ష్మణ్, శ్రావణ్, వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here