నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ కుమ్మరి బస్తీలో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని కుమ్మరి బస్తీలో బిజెప నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బస్తీల్లో రోడ్లు మొత్తం గుంతలమయమై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రోడ్లు, యూజీడీ సమస్యలను పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. వీధి దీపాలు సరిగలేక, డ్రైనేజీల పైకప్పులు లేకపోవడం వల్ల దుర్వాసన, దోమల బెడద నెలకొందన్నారు. కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు, మాణిక్ రావు, బిజెవైఎం జిల్లా నాయకులు జితేందర్, నాయకులు రత్నకుమార్, కాలనీ వాసులు బాబు, బిక్షపతి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
