బాలాజీ నగర్ లో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ మౌళిక వసతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్ కాలనీలో‌ పలు సమస్యల పరిష్కారం కోసం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. కాలనీలో ప్రజల ఇబ్బందుల దృష్ట్యా మౌలికవసతుల కల్పనకు పాటుపడుతామని ఉప్పలపాటి శ్రీకాంత్ చెప్పారు. డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ జగదీష్, స్థానిక నాయకులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here