వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి: ఆలయాల‌ అభివృద్ధికి‌ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ శ్రీ శ్రీ శ్రీ అలివేలు మంగ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారి కల్యాణంలో కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస రావు తో కలిసి ప్రభుత్వ విప్,‌ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు ఎండీ ఇబ్రహీం, అనిల్, వాసు, కాలనీ వాసులు సుబ్రహ్మణ్యేశ్వర రావు, వెంకటేశ్వర్ రెడ్డి, సీబీ రెడ్డి, ప్రసాద్, రాంబాబు, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీకి ఆశీర్వచనం ఇస్తున్న అర్చకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here