నాలా విస్తరణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని, నాలా విస్తరణ పై ప్రణాళికలు రూపొందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అధికారులకు ఆదేశించారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు నుండి దీప్తి శ్రీ నగర్ నాల వరకు రూ.15.88 కోట్ల అంచనా వ్యయంతో 2.4 కిలోమీటర్ల మేర చేపడుతున్న నాలా విస్తరణ పనులను జీహెచ్ఎంసీ, జలమండలి, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాలా నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడకుండా వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతిని, డీఈ విశాలాక్షి, ఏఈ ప్రతాప్, జలమండలి జీఎం రాజశేఖర్, మేనేజర్ సాయి చరిత, ఇరిగేషన్ డీఈ నళిని, ఏఈ శేషగిరిరావు, శేరిలింగంపల్లి డిప్యూటీ సిటీ ప్లానర్ గణపతి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

నాలా‌ విస్తరణ పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here