అన్నపూర్ణ ఎన్‌క్లేవ్ లో ఘనంగా ప్రారంభమైన శ్రీ షిర్డీ సాయినాథ ఆలయ దశమ వార్షికోత్సవాలు

నమస్తే శేరిలింగంపల్లి: విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత చందానగర్ అన్నపూర్ణ ఎన్ క్లేవ్ లోని షిరిడి సాయి, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో శ్రీ షిర్డి సాయినాథ దేవాలయ దశమ వార్షికోత్సవాలు బుధవారం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ఘనంగా ప్రారంభమయ్యాయి. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి దివ్యాశీస్సులతో ఈ నెల 16 నుంచి 18 వ తేదీ వరకు దశమ వార్షికోత్సవాలు జరగనున్నట్లు ఆలయ కమిటీ‌ నిర్వాహకులు తెలిపారు బుధవారం ఉదయం కాకడ హారతి, పంచామృత అభిషేకం, అలంకరణ, గణపతి పూజ, పుణ్య హవచనం, పంచగవ్యప్రాశన, దీక్షారాధన, మద్యాహ్న హారతి, అన్నదానం, అంకురారోపణ, సంధ్యా హారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై సాయిబాబాను దర్శించుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here