శ్రీ భవాని అమ్మవారికి విశేష అభిషేకాలు

నమస్తే శేరిలింగంపల్లి: విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత చందానగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయం లో బుధవారం మాఘ పౌర్ణమి ని పురస్కరించుకుని శ్రీ భవాని అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. శ్రీ భవాని అమ్మ వారికి పంచామృతములు, వివిధ పలాల రసములు, నారికేళ పానీయాలతో అభిషేకం, పుష్పాలంకరణ చేశారు. అనంతరం శ్రీ లక్ష కుంకుమార్చన, శ్రీ లలితాసహస్రనామ పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఉపాధ్యక్షులు తోట సుబ్బారాయుడు, భక్తుల సహకారంతో ఆలయ ప్రధాన అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవాసమితి సభ్యులు, పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ భవాని మాతకు అభిషేకాలు చేస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here