బిజెపి అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ సమన్వయ కమిటీ సభ్యురాలిగా కాంచన కృష్ణ

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ సమన్వయ కమిటీలో కాంచన కృష్ణ కు చోటు దక్కడం సంతోషకరమని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీలో అన్ని వర్గాల వారికి సముచిత‌ స్థానం కల్పిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ సమన్వయ కమిటీ సభ్యులుగా కాంచన కృష్ణను నియమించడం అభినందనీయమని చెప్పారు. ఈ మేరకు కాంచన‌ కృష్ణను రవికుమార్ యాదవ్ శాలువాకప్పి శుభాకాంక్షలు తెలిపారు. శేరిలింగంపల్లిలో బిజెపి బలోపేతానికి క్షేత్ర స్థాయిలో క్రమశిక్షణ తో పని చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేశ్, చేవెళ్ల పార్లమెంట్ కో కన్వీనర్ తోట్ల భరత్ కుమార్, గడ్డం మధు, రమేష్ రెడ్డి, నరసింహ, ఎల్లేశ్ కుర్మ, తదితరులు పాల్గొన్నారు.

కాంచన‌ కృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here