నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తూ అభివృద్ధి పనులను చేపడుతున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్ తో కలిసి మంగళవారం ప్రభుత్వ విప్ గాంధీ పాదయాత్ర చేశారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. దశల వారీగా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మాదాపూర్ డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు ముమ్మరంగా పూర్తి చేసి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడుతామని తెలిపారు. మాదాపూర్ డివిజన్ లోని అన్ని కాలనీలలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ స్రవంతి, ఏఈ ప్రశాంత్, హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్ బి డీజీఎం శ్రీమన్నారాయణ, మేనేజర్ ఇల్వర్తి, ప్రభాకర్, ఎలక్ట్రికల్ ఏఈ రామ్మోహన్, మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, డివిజన్ జనరల్ సెక్రటరీ సాంబశివరావు, నాయకులు శ్యామ్, ఆదిత్య నగర్ టిఆర్ఎస్ బస్తి అధ్యక్షులు మునఫ్ ఖాన్, కృష్ణ కాలనీ బస్తి అధ్యక్షుడు కృష్ణ యాదవ్, సుభాష్ చంద్రబోస్ నగర్ బస్తీ అధ్యక్షులు ముక్తర్, డివిజన్ మైనారిటీ అధ్యక్షులు రహీం పటేల్, మహిళ అధ్యక్షురాలు బుజ్జమ్మ, ఫర్వీన్, నాయకులు ఖాసీం, లియాకత్, బాబూమియా, సలీం, షోయబ్, రెహ్మాన్, రాములు యాదవ్, అంకా రావు, బృంద రావు, డివిజన్ యూత్ అధ్యక్షులు షేక్ ఖాజా, ఆదిత్య నగర్ యూత్ ఆధ్యక్షులు మహమ్మద్ ఖాజా, బాషరత్ ఖాన్, సయ్యద్ సోయేల్, అక్బర్ ఖాన్, మహమ్మద్, అమీర్ ఖాన్, సద్దాం, మొయిన్, తాజ, ఇమ్రాన్, మహిళలు ఉమాదేవి, రాణి, పద్మ, ఇంజినీరింగ్ వర్క్ ఇన్ స్పెక్టర్లు వెంకటేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
