పేదల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం : 60 మందికి కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేసి‌న ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని, పేదింటి ఆడపిల్ల వివాహానికి కేసీఆర్ పెద్దన్నలా వ్యవహరిస్తూ కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలతో అండగా నిలుస్తున్నారని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన 60 మంది లబ్ధిదారులకు రూ. 60 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో కార్పొరేటర్లు రోజాదేవి రంగారావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందన్నారు. సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు వాలా హరీష్ , కాశినాథ్ యాదవ్, పోతుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here