ప్రభుత్వ విప్ గాంధీని కలిసిన ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ కార్యవర్గం

నమస్తే శేరిలింగంపల్లి: ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీలో ఇటీవల నూతనంగా ఎన్నికైన సొసైటీ సభ్యులు శుక్రవారం ప్రభుత్వ విప్, శాసనసభ్యులు ఆరెకపూడి‌గాంధీని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆషాడం మాసం పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం శ్రీ కోమటికుంట కట్ట మైసమ్మ బోనాల జాతరకు సొసైటీ సభ్యులు ఎమ్మల్యే గాంధీని ఆహ్వానించారు. కొత్తగా ఎన్నికైన సొసైటీ అధ్యక్షుడు విఠల్, కార్యదర్శి నర్సింహా రెడ్డి, సభ్యులను ఎమ్మెల్యే గాంధీ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. స్థానికంగా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌మ స‌హ‌కారం ఎల్ల‌ప్పుడూ ఉంటుంద‌ని వారికి గాంధీ హామీ ఇచ్చారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి‌ గాంధీ ని కలిసిన సొసైటీ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here