ఈసారి కూడా పోరెడ్డి సంజీవరెడ్డికే..

  • నాలుగు లక్షల 30 వేలకు లడ్డు కైవసం

నమస్తే శేరిలింగంపల్లి : తారా నగర్ శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడు విశేష పూజలు అందుకున్నాడు. అనంతరం నిర్వహించిన గణేష్ నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం లడ్డూ వేలం వేడుకగా జరిగింది. అయితే ఈసారి కూడా గణేష్ లడ్డూని  పోరెడ్డి సంజీవరెడ్డి కుటుంబ సభ్యులు దక్కించుకోవడం విశేషం.

గత సంవత్సరం మూడు లక్షల 80 వేల రూపాయలకు లడ్డూని దక్కించుకోగా.. ఈసారి నాలుగు లక్షల ముప్పై వేలకు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు వినాయక స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. వినాయక శోభ యాత్రలో పాల్గొని విజయవంతం చేసిన గ్రామ పెద్దలకు మిత్రులకు వర్తకులు , స్థానికులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here