కూకట్ పల్లి కోర్టులోని బార్ అసోషియేషన్ కార్యాలయంలో న్యూ ఇయర్ డైరి, క్యాలెండర్ ఆవిష్కరణ

  • హాజరైన న్యాయముర్తులు, న్యాయవాదులు

నమస్తే శేరిలింగంపల్లి : కూకట్ పల్లి కోర్టులోని బార్ అసోషియేషన్ కార్యాలయంలో 2024 నూతన సంవత్సర డైరి, క్యాలెండర్ ను జిల్లా అదనపు న్యాయమూర్తులు కళ్యాణ్ చక్రవర్తి, పావని ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

కూకట్ పల్లి కోర్టులోని బార్ అసోషియేషన్ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్ చేస్తున్న జిల్లా అదనపు న్యాయమూర్తులు కళ్యాణ్ చక్రవర్తి, పావని, న్యాయవాదులు

ఈ సందర్భంగా బార్ అసోషియేషన్ అధ్యక్షుడు. పి. గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో న్యాయవాదులకు మంచి జరగలని అభిలాషించారు. కూకట్ పల్లి కోర్టు ఈ కొత్త సంవత్సరంలో నూతన సొంత భవనానికి మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

డైరీని ఆవిష్కరిస్తూ..

ఈ కార్యక్రమంలో బార్ -అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షులు మల్లేష్, హరి శంక రెడ్డి, డెవిడ్ రాజు, హర్షవర్షన్ రెడ్డి, శ్రీలత, శివకృష్ణ, జోష్న, చంద్రశేఖర్, శేఖర్ గౌడ్, శ్వేత, బాలాపీర్ తదితరులు పాల్గన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here