జాతీయ స్థాయి కుస్తీ పోటీలలో విజేత.. అంతర్జాతీయ స్థాయికి అర్హత

  • కుస్తీ క్రీడాకారులను సత్కరించిన బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: రెజ్లింగ్ ఫెడరేషన్ ఇండియా ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన నేషనల్ గ్రప్ల్లింగ్ (రెజ్లింగ్) ఛాంపియన్ షిప్ పోటీలలో గచ్చిబౌలి డివిజన్ నానక్ రామ్ గుడాకు చెందిన యువకులు ధన్ రాజ్ సింగ్ 84 కేజీల విభాగంలో బంగారు పతకం, శివా సింగ్ 92 కేజిల విభాగంలో కాంస్య పతకం, రేగుల నరేందర్ 100 కేజీల విభాగంలో బంగారు పతకం కైవసం సాధించారు. వీరిని మసీదు బండలోని కార్యాలయంలో శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ గౌరవం దేశ నలుమూలల తెలిసేలా శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి క్రీడాకారులు పలు క్రీడలలో సత్తా చాటుతున్నారని, వారందరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో వివిధ క్రీడలలో ఎంతో మంది నైపుణ్యం ఉన్న క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని అన్నారు. క్రీడారంగంలో నైపుణ్యం ఉండి ఆర్థికంగా వెనుకబడిన వారికి తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు.

అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన కుస్తీ క్రీడాకారులను సత్కరించిన బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here