కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో బిజెపి సేవా సప్తాహ్

వైద్యులను సన్మానిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు బాల్ద అశోక్, నందకుమార్ యాదవ్

-ప్రధాని మోడి జన్మదిన వారోత్సావాల్లో భాగంగా వైద్యులకు సన్మానం
-రోగులకు పండ్లు, బ్రెడ్, బిస్కట్లు పంపిణీ చేసిన బిజెపి నాయకులు

కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో సోమవారం బిజెపి సేవా సప్తాహ్ కార్యక్రమం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో నిరంతర సేవలు కొనసాగిస్తున్న ఏరియా హాస్పిటల్ వైద్యులను ఆ పార్టీ జిల్లా నాయకులు చింతకింది గోవర్ధన్ గౌడ్, తోపుగొండ మహిపాల్ రెడ్డి, మక్తల స్వామి గౌడ్ ల సౌజన్యంతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా రోగులకు పండ్లు, బ్రెడ్, బిస్కెట్లు ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న రాష్ట్ర నాయకులు బాల్ద అశోక్, నందకుమార్ యాదవ్ లు మాట్లాడుతూ ప్రధాని మోడి జన్మదినాన్ని పురస్కరించుకుని కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఐన ప్రభుత్వ వైద్యులను సత్కరించుకునే అవకాశం లభించడం సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి అధ్యక్షులు జయరామ్, సీనియర్ నాయకులు నార్రా జయలక్ష్మి, వినితా సింగ్, అంజనేయులు, శ్రీకాంత్ గౌడ్, చందు యాదవ్, వెంకట్ నాయక్, వెంకట్ రామణ, ప్రేమ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న బిజెపి నాయకులు బాల్ద అశోక్, నందకుమార్ యాదవ్, గోవర్ధన్ గౌడ్, మహిపాల్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here