కనుల పండువగా కార్తీక పౌర్ణమి

  • వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
  • భక్తి శ్రద్దలతో కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు

నమస్తే శేరిలింగంపల్లి : విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొవిడ్ కారణంగా రెండేండ్ల తర్వాత కార్తీక దీపాలు వెలిగించుకునే అవకాశం రావడంతో పెద్ద ఎత్తున భక్తులు దేవాలయానికి తరలివచ్చారు. భక్తి శ్రద్దలతో కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించి వారి మొక్కులు తీర్చుకున్నారు. హరిహరుల దర్శనం చేసుకొని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ పాలకవర్గ సభ్యులు భక్తుల సౌకర్యార్ధం సకల ఏర్పాట్లు చేశారు.

వేంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక దీపాలు వెలిగిస్తున్న అశేష భక్త జనం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here