కనుల విందుగా శ్రీవారి కళ్యాణం

  • మాఘమాస శ్రవణం శ్రీవారి జన్మనక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు
  • భక్త జనంతో కిటికిటలాడిన దేవాలయ ప్రాంగణం
పద్మావతి, గోదాదేవిమాత సమేత శ్రీవేంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తున్న ఆలయ అర్చకులు

నమస్తే శేరిలింగంపల్లి: మాఘమాస శ్రవణం శ్రీవారి జన్మనక్షత్రం సందర్భంగా పద్మావతి, గోదాదేవిమాత సమేత శ్రీవేంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిపించారు. చందానగర్ విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణ నక్షత్ర కల్యాణం, వివిధ సేవలు చేసే సేవాసమితి సభ్యుల కోసం ఆలయ ప్రధానఅర్చకులు సత్యసాయి అభ్యర్ధన మేరకు విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహస్వామి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ మహస్వామితో పాటుగా దేవాలయ కార్యవర్గ సభ్యులు అంగీకారం తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయంలో వివిధ సేవలు చేసే సభ్యులు సుమారుగా 90 మంది దంపతులచే ప్రధాన అర్చకులు సత్యసాయి కళ్యాణం ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. తదనంతరం శాంతి హోమం, దంపతులకు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపించారు. ఈ కార్యక్రమంలో ఉభయదేవేరులకు వేంకటేశ్వర స్వామి (మూలవిరాట్ లకు)కి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి పుష్పాఅలంకారం చేయించారు. ఆలయ కార్యవర్గసభ్యుడు బి.శ్రీకాంత్ అన్నప్రసాద వితరణ చేయించారు. పి. ధర్మ కల్యాణ వేంకటేశ్వర స్వామికి పుష్పాలంకరణ చేయించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యవర్గ సభ్యులు సేవాసమితి సభ్యులు, అశేష భక్తజనం పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించి స్వామి వారి హారతి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.

చందానగర్ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం పాల్గొన్న దంపతులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here