నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి, చందానగర్ గంట సర్కిల్లో కంటి వెలుగు కేంద్రాలు సిద్ధమయ్యాయి. శేరిలింగంపల్లి డివిజన్ 106 లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కొండాపూర్ డివిజన్ 104లో కొత్తగూడ కమ్యూనిటీ హాల్, కొండాపూర్ డివిజన్ 104లో సాగర్ సంగం కమ్యూనిటీ హాల్, గచ్చిబౌలి డివిజన్ 104 లో రాయదుర్గం వార్డు కార్యాలయం, మాదాపూర్ డివిజన్ 117 లో కల్చరల్ క్లబ్ అయ్యప్ప సొసైటీ, మియాపూర్ డివిజన్ 108 లో మయూరినగర్ కమ్యూనిటీ హాల్, హఫీజ్పేట డివిజన్ 109 లో జనప్రియనగర్ PH-2 కమ్యూనిటీ హాల్, చందానగర్ డివిజన్ 110లో పిజెఆర్ స్టేడియం వధ్ద కంటి వెలుగు శిబిరాలు కొనసాగనున్నాయి.
లింగంపల్లి పిహెచ్సిలో కంటి వెలుగు కేంద్రాాాాన్ని పరిశీలించిన జడ్సీ శంకరయ్య
శేరిలింగంపల్లి సర్కిల్-20లోని లింగంపల్లి పిహెచ్సిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రం ఏర్పాట్లను జోనల్ కమిషనర్ శంకరయ్య పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. కంటి పరీక్షల అనంతరం కావాల్సినవారికి అద్దాలు ఇవ్వడంతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-18-at-6.23.53-PM.jpeg)