కష్ట కాలంలోనూ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: ఆరెకపూడి గాంధీ

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్ పొడి గాంధీ

-కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గాంధీ

శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీీ లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హైదర్ నగర్ డివిజన్ , కూకట్పల్లి డివిజన్ కి చెందిన పలువురికి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం కింద చెక్కులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్ , మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , తెరాస నాయకులు పద్మారావు , నరేష్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here