
హైదర్నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్నగర్ డివిజన్ పరిధిలో రూ.1.61 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులు ఒకే రోజు ప్రారంభమయ్యాయి. డివిజన్ పరిధిలోని హైదర్నగర్ లో రూ.5 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పునరుద్ధరణ పనులకు, నందమూరి నగర్లో రూ.18 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పునరుద్ధరణ పనులకు, అదే కాలనీలో రూ.7.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న వరద నీటి కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే హెచ్ఎంటీ హిల్స్లో రూ.19.50 లక్షలతో చేపట్టనున్న డివైడర్ పనులకు, తులసి నగర్లో రూ.50.95 లక్షలతో చేపట్టనున్న వీడీసీసీ రోడ్డు పనులకు, బృందావన్ కాలనీలో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న వీడీసీసీ రోడ్డు పనులకు, అడ్డగుట్ట, తులసి నగర్లలో రూ.35 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ జానకి రామరాజు తో కలసి మంగళవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదర్ నగర్ డివిజన్ లో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. డివిజన్ లో ఈప్పటికే కోట్ల రూపాయల పనులు చేపట్టామని, అక్కడ అక్కడ మిగిలి ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు డీఈ సత్యనారాయణ ఏఈ రాజీవ్ డివిజన్ అధ్యక్షుడు నార్నె శ్రీనివాస రావు, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్ , మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు రావూరి సైదేశ్వర్ రావు, కోనేరు కృష్ణ ప్రసాద్, కృష్ణ ముదిరాజ్, పోతుల రాజేందర్, సుబ్బారావు , శ్రీహరి, అష్రాఫ్, వెంకటేష్ యాదవ్, శ్రీకాంత్, ఖదీర్, సద్దాం, కృష్ణ కుమారి , విమల , స్వప్న , పద్మ, విజయ , రేణుక, కాలనీ వాసులు వేదమూర్తి ఉమామహేశ్వర్ రావు , రంగనాధ రాజు , MV కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
