నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎనక్లేవ్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి వినతిపత్రం సమర్పించారు. డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్ దీపాలు, రోడ్లు తదితర సమస్యలను గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలపై స్పందించిన గాంధీ త్వరలోనే పరిష్కరిస్తానని, అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాలనీ వాసులు అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులదరి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు , జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, విద్యాసాగర్, మల్లారెడ్డి, వనామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
