శేరిలింగంపల్లి జోనల్ నూతన కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసిన హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోనల్ నూతన కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రెడ్డిని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు. కొండాపూర్ డివిజన్ లోని పలు సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. త్వరిత గతిన అభివృద్ధి పనుల చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా కొండాపూర్ డివిజన్ లో పలు బస్తిలలో మన ప్రభుత్వ హయాంలో దాదాపుగా డభై శాతం పనులను పూర్తి చేసుకున్నామని, బస్తిలలో మిగిలి ఉన్న మట్టి రోడ్లను వెంటనే పూర్తి చెయ్యాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here