నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ ఎస్ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంత కర్త తెలంగాణ స్ఫూర్తిదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి నిర్వహించారు. ఈ సందర్బంగా సార్ చిత్రపటాన్ని తన ఇంటి వద్ద ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణకు ఆయన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని, ఆంధ్ర పాలకులు హటావో తెలంగాణ బచావో అనే నినాదం ఎత్తుకొని ఆయన తెలంగాణ తెచ్చి ఇచ్చారన్నారు. రాబోయే తరాలకు సార్ గురించి తెలియపరుస్తూ ప్రతి సంవత్సరము తన జయంతి, వర్ధంతిని ఘనంగా చేయాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి అనీఫ్ , సంకటి స్వామి, నర్సింలు పాల్గొన్నారు.