జనసేనకు మద్దతివ్వండి: జనసేన శేరిలింగంపల్లి ఇన్ చార్జి  మాధవ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ, తెలుగు రాష్ట్రాల కాపు సంఘాల నాయకుడు, జంట నగరాల కాపు సంక్షేమ సేవా సంఘాలకి అధ్యక్షుడు, సీనియర్ నాయకులు మిర్యాల రాఘవని మర్యాదపూర్వకంగా కలిసి, రాబోయే ఎమ్మెల్యే ఎన్నికలలో జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాలని జనసేన పార్టీ  శేరిలింగంపల్లి ఇన్ చార్జి  మాధవ రెడ్డి తెలిపారు.

జనసేన విజయానికి దోహదం పడాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో  శేరిలింగంపల్లి నియొజకవర్గంలోని కాపు , ఇతర కులాల వారిని కలుపుకుంటూ మరింత బలంగా పని చేయాలని, అదేవిధంగా బూత్ కమిటీలను బలంగా చేసుకోవాలి సూచనలు ఇచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here