నమస్తే శేరిలింగంపల్లి : జనసేన పార్టీ గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడిగా మీల రాజ్ కుమార్ ని నియమితులయ్యారు. తనపై నమ్మకంతో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారాం రాజలింగం, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ మాధవ రెడ్డి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలతో మమేకమై, సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తూ, ప్రభుత్వం, యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలను పరిష్కరించి, ప్రజలకు జనసేన పార్టీ పై నమ్మకం కలిగేలా కృషి చేస్తానని తెలిపారు.