నమస్తే శేరిలింగంపల్లి : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ ని ఆయన నివాసంలో ఆ పార్టీ నియోజకవర్గం నాయకులు ఏకాంత్ గౌడ్, విద్యాకల్పన గౌడ్ వివేకానంద నగర్ డివిజన్ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం పూలబొకే అందించి నూతన సంవత్సరo శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ సుబ్బారావు, మురళీకృష్ణ, పల్నాటి అశోక్, గణేష్ గౌడ్, జితేందర్, శృతి గౌడ్, పోతురాజు, నాగరాజు, దయాకర్ రెడ్డి, బొట్టు శ్రీను, విష్ణుమూర్తి, వినోద్, వెంకటేష్ పాల్గొన్నారు.






