- గచ్చిబౌలి దర్గా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో పనులు
- ప్రధానోపాధ్యుడిపై చర్యలు తీసుకోవాలి : బొబ్బ నవతా రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: బడికెళ్లి చదుకోవాల్సిన పిల్లలు.. పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు శేరిలింగంపల్లిలో బడి పిల్లల పరిస్థితి అద్వాన్నంగా తయారైందని వాపోయారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్య పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పే ఎమ్మెల్యే గాంధీ కి ఇవి కలపడటం లేదా అని ప్రశ్నించారు. గచ్చిబౌలి డివిజన్ దర్గా ప్రభుత్య పాఠశాలలో టీచర్లు విద్యార్థులచే కార్లు కడిగించడం, చెత్త ఎత్తించడం, మట్టి పనులు చేయించడం, అమ్మాయిలచే ఉడిపించడం, ఇలాంటి పనులు చేయించడం భావ్యం కాదన్నారు. గచ్చిబౌలి ప్రభుత్య ప్రధానోపాధ్యుడిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.