గోపనపల్లి తండాలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండాలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అధికారులకు తెలిపారు.

గోపనపల్లి తండాలో కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు పర్యటించి అక్కడ నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు తమ కాలనీలో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు, మంచి నీళ్లు, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరగా.. వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. గోపనపల్లి తండా వాసులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్, సీసీ రోడ్డు, మంచి నీళ్లు, అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు వేగంగా చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి కావాల్సిన తగు చర్యలు చేపట్టాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆదేశించారు. ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకు రావాలని ప్రజలకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు శేఖర్, ప్రకాష్, వేణు, రంగస్వామి, వర్క్ ఇన్ స్పెక్టర్ విశ్వనాథ, గోపనపల్లి తండా కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here