అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం: కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని, శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోనే మాదాపూర్ డివిజన్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర గౌడ్ అన్నారు.

మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో పర్యటించి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను కాలనీ సభ్యులతో సమీక్షించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గోకుల్ ప్లాట్స్ బిఆర్ఎస్ బస్తి అధ్యక్షులు బి.శ్రీనివాస్, వార్డ్ సభ్యులు శ్రీనివాస్,నాయకులు నాగేశ్వరరావు, ప్రభాకర్, సాంబయ్య, ప్రసాద్, సత్యం, ప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here