వేడుకగా సెమీ క్రిస్మస్

  • కేక్ కట్ ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గోదాకృష్ణ ఫంక్షన్ హాల్ లో క్రిస్టమస్ వేడుకల సందర్భంగా సెమి క్రిస్టమస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావుతో కలిసి క్రిస్టమస్ కేక్ కట్ చేసి, క్రిస్టియన్ సోదరి సోదరమణులకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముందస్తు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు.

గోదాకృష్ణ ఫంక్షన్ హాల్ లో జరిగిన సెమి క్రిస్టమస్ వేడుకల్లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఏసుక్రీస్తు కృప వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించుకోవాలని, ప్రతి ఒక్కరు సంతోషంగా పండుగను జరుపుకోవాలని, ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, క్రిస్టమస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ సోదర సోదరిమనులకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఆరెకపూడి గాంధీకి సన్మానం

ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి, పాస్టర్లు, క్రిస్టియన్ సోదరి, సోదరమణులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here